తప్పులెన్నువారు తండోపతండంబు,
లుర్వి జనులకెల్ల నుండుతప్పు,
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు,
విశ్వదాభి రామ వినరా వేమ!
ఈ ప్రపంచంలో ఇతరుల తప్పులు చెప్పేవారు ఎంతో మంది. తప్పులు అందరిలో ఉంటాయి.ఇతరుల తప్పులు ఎంచే వారు తమ తప్పులు తెలుసు కోరు అని అర్థం.
ఈ పద్యం అందరికి తెలిసే ఉంటుంది కానీ ఎవ్వరు ప్రక్క వారి గురుంచి మాట్లడేముందు ఆలోచించరు.కనీసం తమ స్థాయి ఏంటో తెలుసుకోకుండా ఇతరుల తప్పులను వేలెత్తి చూపించే వారిని చూసి జాలి పడుతున్నా.
అభేద్యా, తప్పులెన్నువారిలో నేనూ ఒకణ్ణి అవుతున్నందుకు నన్ను చూసి ఎలాగూ జాలి పడతారు కదా. ఇక తప్పేమిటంటే అది ఆటవెలది పద్యం. మూడవ పాదం “తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా” అని రాసారు. అది “తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు” అని ఉండాలి.
మంచి పద్యం..మంచి మాట… కాని జాలి పడుతున్నరనుకోను (మీ తప ఆకరి లైను గురించి..) వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారేమో…
శంకరయ్య గారు,
మీరు స్పందించినందుకు ఎంతో సంతోషం.
ఇక్కడ నా ఉద్యేశం మీ లాంటి వారి గురించి కాదండి, మీ స్థానం గురువు.
నా వాఖ్యలు, ఏమి మట్లాడుతున్నారో కూడా తెలియకుండా వాగే వాల్ల గురించి :).
పద్యం చిన్నప్పుడు చదువుకున్నది అండి.నేను సరి చూసుకోకుండా పోస్ట్ చేసాను.
మీరు చెప్పినట్లు సరి చేసాను.
శివ గారు , మీరన్నట్టు తెలియజేసే ప్రయత్నమే, కాని వారు బ్లాగులు చూడరు పెద్దోల్లు.
మీ స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞున్ని.