నేను మా ఊరిలో వున్నాను. నిన్న ఒక పని చేశాను. కాని అది మంచో చెడో అర్థం కాలేదు.
నాకు ఒక షాప్ దగ్గర అయిదు వందలు దొరికాయి. అవి ఆ షాప్ వాడివి కావని అర్థం అయ్యింది. వాడిని అడిగితే ఖచ్చితంగా అతనివే అని తీసుకుంటాడు. అందుకని ఆ 500 ఎవరికయిన ఇద్దాం అని నేను మా అన్న అనుకున్నాం. డబ్బులు ఇస్తే అవి వాడుకోరు అని అనిపించి అన్నకు చెప్పాను.
అన్న ప్రతి శనివారం గుడికి వెళతాడు. అక్కడ ముసలి వాళ్ళు చలిలో వుంటారు అన్నాడు. వెంకటేశ్వరస్వామి గుడి దగ్గరకు వెళ్ళి చూశాము. అక్కడ ఒక ముసలావిడ వున్నింది. సరే అనుకొని ఒక బట్టల షాపుకు వెళ్ళి రెండు దుప్పట్లు కొని 400 రూపాయలకు గుడికి వెళ్ళాము.
“అవ్వా ఇందులో రెండు దుప్పట్లు వున్నాయి. ఒకటి నువ్వు తీసుకొని ఇంకొకటి నీ పక్కనుండే అవ్వకు ఇవ్వు అని చెప్పి, మిగిలని 100 రూపాయల్తో తినమని చెప్పి వచ్చాము”.
కాని లోపల ఏ మూలో బాధగా అనిపించింది. ఆ 500 ఎవరియిన పేదవాడివి ఏమో అని. ఆ పోగొట్టుకున్నవాడికి మంచి జరగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా.
ఇందులో భాదకి తావులేదు.ఇన్డులో ఒక ధర్మసూక్ష్మం దాగిఉంది.దానమైనా/దాడి జరపడమైనా ,అవి ఎవరిద్వారా నిర్వహించబడాలో,వారిద్వారా మాత్రమె జరుగుతాయ్.పోగొట్టుకున్న వ్యక్తి దానిని దానంకోసమే ఉంచిఉంటారు,ఆ దానం మీ ద్వారా జరగాలని విధాత నిర్ణయం అంతె.మరో వింతైన విష్యం ఏమంటే,మీరు చేసిన ఆ దాన పుణ్యం నేరుగా..డబ్బు పోగొట్టుకున్న వ్యక్తికి చేరుతుంది.మీరు ఈ విషయంలో కేవలం ఒక మాధ్యమం మాత్రమె సుమా?
నేను కూడా ఆ పుణ్యం, డబ్బు పోగొట్టుకున్న అతనికే చెందాలని ప్రార్ఠిస్తున్నా.